Divith Reddy | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ చెస్ ప్లేయర్ అదుల్ల దివిత్రెడ్డి సంచలనం సృష్టించాడు. అల్బేనియా వేదికగా జరుగుతున్న ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్ అండర్-8 ఓపెన్ విభాగంలో దివిత్రెడ్డి విజేతగా నిలిచాడు. మొత్తం 11 రౌండ్ల తర్వాత దివిత్ 10 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
టోర్నీలో 10 గేముల్లో గెలిచిన ఈ చెస్ చిచ్చరపిడుగు ఒక గేమ్లో ఓటమి ఎదుర్కొన్నాడు. బ్లిట్జ్లో దివిత్ కాంస్యం దక్కించుకన్నాడు. మరోవైపు అండర్-12 బాలికల విభాగంలో శ్రావణిక చాంపియన్గా నిలిచి ఆకట్టుకుంది.