కాన్పూర్: టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను మిడిలార్డర్కు మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. న్యూజిలాండ్తో సిరీస్లో ఈ ప్రయోగం చేయాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. హిట్మ్యాన్ రోహిత్ శర్మతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా.. విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో ధాటిగా ఆడే ప్లేయర్ ఉండాలనే ఉద్దేశంతో జట్టు యాజమాన్యం.. శుభమన్ గిల్ను మిడిలార్డర్లో ఆడించేందుకు ప్రయత్నిస్తున్నది.