హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత మహిళల సీనియర్ ఫుట్బాల్ జట్టు శిక్షణ శిబిరానికి రాష్ట్ర యువ సాకర్ ప్లేయర్ గుగులోతు సౌమ్య ఎంపికైంది. వచ్చే ఏడాది జరిగే ప్రతిష్ఠాత్మక ఏఎఫ్సీ ఆసియా కప్ టోర్నీ కోసం అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) శుక్రవారం 30 మందితో ప్రకటించిన జట్టులో మిడ్ఫీల్డర్ సౌమ్య చోటు దక్కించుకుంది. జంషెడ్పూర్ వేదికగా ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 6 వరకు శిబిరం జరుగనుంది. స్టార్ ప్లేయర్ బాలాదేవి..ఆలస్యంగా జట్టుతో కలువనుండగా, దలిమా చిబర్ పది రోజుల తర్వాత కెనడా లీగ్లో ఆడేందుకు వెళ్లనుంది. భారత మహిళల జట్టుకు కొత్త కోచ్గా స్వీడన్కు చెందిన థామస్ డెన్ర్బీ ఎంపికయ్యాడు.