Ganguly on Kohli | భారత క్రికెట్కు టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ గొప్ప ఆస్తి అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ దిగ్విజయంగా ముందుకు నడిపించారని పేర్కొన్నారు.
త్వరలో జరిగే టీ-20 ప్రపంచ కప్ తర్వాత టీ-20 జట్టు సారధ్యం నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీపై గంగూలీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భవిష్యత్ కోసమే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునన్నారు. మూడు ఫార్మాట్లలోనూ విజయవంతమైన కెప్టెన్ అని గంగూలీ కొనియాడారు.
టెస్ట్ క్రికెట్పై మరింత ద్రుష్టి సారించేందుకే టీ-20 ఫార్మాట్ సారధ్యానికి విరాట్ కోహ్లీ గుడ్బై చెప్పారని వెటరన్ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ వ్యాఖ్యానించారు. కోహ్లీ గొప్ప క్రికెటర్.. టీం ఇండియాకు మరుపు రాని విజయాలు సాధించారని పేర్కొన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ.. కోహ్లీ సేవలు మరువలేనివని ప్రశంసించారు.