Gautam Gambhir : భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(Gautam Gambhir) మరోసారి సంచలన కామెంట్స్తో వార్తల్లో నిలిచాడు. 17వ సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మెంటార్గా బాధ్యతలు చేపట్టిన గౌతీ.. ఐపీఎల్ అంటే బాలీవుడ్, గ్రామర్ కాదని అన్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ అనేది సీరియస్ క్రికెట్. ఈ విషయం నేను మొదటి రోజునే చెప్పాను.
ఈ లీగ్ అంటే బాలీవుడ్, గ్లామర్ కాదు. ఐపీఎల్ అంటే అత్యంత పోటీ ఉన్న క్రికెట్. అందుకనే ఐపీఎల్ ప్రపచంలోనే కష్టమైన టీ20 లీగ్గా పేరొందింది’ అని గంభీర్ వెల్లడించాడు. అంతేకాదు కోల్కతా నైట్ రైడర్స్కు మంచి ఫ్యాన్ బేస్ ఉందని, ఐపీఎల్ అరంభంలో కోల్కతా అద్భుత ప్రదర్శన చేసిందిన గంభీర్ వెల్లడించాడు. కోల్కతా జట్టు చిల్లర పనులతో వార్తల్లో నిలవదని, మైదానంలో తమ ఆటతోనే అభిమానుల మనసు గెలుస్తుందని చెప్పాడు. గంభీర్ సారథ్యంలో కోల్కతా 2012, 2014లో చాంపియన్గా నిలిచింది.
టీమిండియా గొప్ప ఓపెనర్లలో ఒకడైన గంభీర్ 2011 వరల్డ్ కప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లను ఉతికారేస్తూ భారత జట్టు రెండోసారి వరల్డ్ కప్ గెలవడంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన గంభీర్ రాజకీయాల్లో చేరాడు. 2019లో బీజేపీ(BJP) తరఫున ఉత్తర ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికైన గంభీర్ క్రికెట్ లీగ్స్లో మెరిశాడు.
అయితే.. పార్టీ వ్యవహారాల కంటే క్రికెట్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడనే విమర్శలు అతడిపై వచ్చాయి. దాంతో, ఈ ఏడాది లోక్సభ ఎన్నికల ముందు రాజకీయలకు గుడ్ బై చెప్పాడు. తనను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా(JP Nadda)కు గౌతీ పోస్ట్ పెట్టాడు. ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న ఆరంభం కానుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తమ తొలి మ్యాచ్లో హైదరాబాద్ జట్టుతో తలపడనుంది.
I have requested Hon’ble Party President @JPNadda ji to relieve me of my political duties so that I can focus on my upcoming cricket commitments. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Hon’ble HM @AmitShah ji for giving me the opportunity to serve the people. Jai Hind!
— Gautam Gambhir (@GautamGambhir) March 2, 2024