గజ్వేల్అర్బన్, జనవరి14: గజ్వేల్ పట్టణంలో గత నాలుగు రోజులుగా హోరాహోరీగా సాగుతున్న 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ క్రీడాపోటీలు ఆదివారంతో ముగిసాయి. 33జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్న ఈ క్రీడాపోటీలో జూనియర్ బాలికల విభాగంలో నల్లగొండ 55-42 తేడాతో రంగారెడ్డిపై ఘన విజయం సాధించింది.
బాలుర కేటగిరీలో రంగారెడ్డి 34-27తో నల్లగొండపై గెలిచి టైటిల్ దక్కించుకుంది. ఫైనల్ కబడ్డీ పోటీలు మరింత హోరాహోరీగా సాగగా నిర్వాహకులు, అతిథులు, ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతతో వీక్షించారు. విజేతలకు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ టీడీసీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, రాష్ట్ర ఒలంపిక్, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్యాదవ్, మహిళ కమిషన్ చైర్మన్ రాజ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి శివకుమార్ తదితరులు ట్రోఫీలను అందజేశారు.