French Open Badminton | ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2024 చాంపియన్ షిప్ టోర్నీలో భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ఆదివారం జరిగిన ఫైనల్స్ లో టైటిల్ గెలుచుకున్నారు. వీరి జోడికి ఇది రెండో ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ డబుల్ టైటిల్. ఆదివారం జరిగిన ఫైనల్స్ లో చైనీస్ తైపై లీ జీ-హువై, యాంగ్ పో-హుసన్ జోడీపై భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి విజయం సాధించారు. 21-11, 21-17 పాయింట్ల తేడాతో చైనీస్ తైపై జోడీపై గెలుపొందారు.
తొలి గేమ్ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సునాయసంగా గెలుపొందినా, రెండో సెట్లో మాత్రం గట్టి పోటీని ఎదుర్కొన్నారు. ఇంతకుముందు 2022లో డబుల్ మెన్స్ టైటిల్ను భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి గెలుచుకున్నారు. 2019లో భారత్ జోడీ ఫైనల్స్ లో ఓటమి పాలై రన్నరప్ గా నిలిచారు.