WPL 2026 : మహిళల క్రికెట్కు విశేష ఆదరణ కల్పించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మరో ఎడిషన్కు సిద్ధమవుతోంది. గత మూడు సీజన్లు అభిమానులను అలరించిన ఈ మెగా టోర్నీ నాలుగో సీజన్ రాబోతోంది. అంతకంటే ముందుగా వేలం నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. నవంబర్ 25 లేదా 29న ఆక్షన్ జరిపేందుకు నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే ఎంతమందిని అట్టిపెట్టుకోవాలి? రైట్ టు మ్యాచ్? వంటి వాటి గురించి ఫ్రాంచైజీలకు కీలక సూచనలు చేశారు.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ వేలం నేపథ్యంలో ఐదు ఫ్రాంచైజీలకు గురువారం నిర్వాహకులు ఈమెయిల్ పంపించారు. అందులో.. రీటైన్, ఆర్టీఎమ్, అన్క్యాప్డ్ ప్లేయర్లకు సంబంధించిన విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఈసారి ఐదుగురిని మాత్రమే అట్టిపెట్టుకునేందుకు ఫ్రాంచైజీలకు అనుమతిచ్చారు. ఇందులో గరిష్టంగా భారత క్రికెటర్లు ముగ్గురు.. విదేశీయులు ఇద్దరు ఉండాలని సూచించారు. భారత క్రికెటర్లలో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లను రీటైన్ చేసుకునేందుకు ఓకే చెప్పారు. నవంబర్ 5వ తేదీలోపే అన్ని యాజమాన్యాలు తమ రీటైన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించాలని తెలిపారు. పేర్ల నమోదుకు నవంబర్ 18 ఆఖరు తేదీ. నవంబర్ 20న వేలంలో నిలిచిన ప్లేయర్ల పేర్లను బీసీసీఐ విడుదల చేయనుందని సమాచారం.
With a total auction purse of INR 15 crore, franchises can retain a maximum of five players ahead of the mega auction for WPL 2026
More details ➡️ https://t.co/yI03etHiTW pic.twitter.com/ClxacRNPMy
— ESPNcricinfo (@ESPNcricinfo) October 9, 2025
ఐపీఎల్ మాదిరిగానే డబ్ల్యూపీఎల్లో రైట్ టు మ్యాచ్ను అనుమతిస్తూ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక ఫ్రాంచైజీ ఐదు ఆర్టీఎమ్లో పాల్గొనవచ్చు. ఒకవేళ ఫ్రాంచైజీ నలుగురిని అట్టిపెట్టుకుంటే వాళ్లకు ఒకేఒక ఆర్టీఎమ్ ఛాన్స్ ఉంటుంది. అలానే ముగ్గురిని రీటైన్ చేసుకుంటే రెండు ఆర్టీఎమ్స్లో పాల్గొనవచ్చు. ఇద్దరిని రీటైన్ చేసుకుంటే..మూడు ఆర్టీఎమ్స్, ఒక్కరినే అట్టిపెట్టుకుంటే నాలుగు ఆర్టీఎమ్స్ లభిస్తాయి.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ వేలంలో ఫ్రాంచైజీలు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నాయి. స్లాబ్స్ విషయానికొస్తే.. ఒక క్రికెటర్కు మాత్రమే రూ.3.5 కోట్లు చెల్లించే అవకాశముంది. రెండో ప్లేయర్కు రూ.2.5 కోట్లు, మూడో ప్లేయర్కు రూ.1.75కోట్లు, నాలుగో బ్యాటర్కు రూ.1 కోటి.. ఐదుగురు ప్లేయర్లకు రూ.50 లక్షలు వేలం పాట పాడాల్సి ఉంటుంది. ఒక ఫ్రాంచైజీ ఐదుగురిని అట్టిపెట్టుకుంటే వాళ్ల పర్స్ నుంచి రూ.9.75 ను తొలగిస్తారు. ఒకవేళ నలుగురిని రీటైన్ చేసుకుంటే.. రూ.8.75 కోట్లు.. ముగ్గురికి రూ.7.75 కోట్లు, ఇద్దరిని రీటైన్ చేసుకుంటే రూ.6 కోట్లు కట్ చేస్తారు.
🚨 REPORTS 🚨
WPL franchises can retain a maximum of five players — with up to three Indian capped players, two overseas players, and two uncapped Indian players. 🏆
If a franchise retains five players, at least one of them must be an uncapped Indian player.#Cricket #India… pic.twitter.com/G7WcAos4RY
— Sportskeeda (@Sportskeeda) October 9, 2025
మహిళల క్రికెట్ పురోగతి కోసం డబ్ల్యూపీఎల్కు శ్రీకారం చుట్టింది బీసీసీఐ. తొలి సీజన్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు చెక్ పెట్టి విజేతగా కప్ను అందుకుంది. రెండో సీజన్లోనూ హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై తిరుగులుని ఆధిపత్యం చెలాయిస్తూ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అయితే.. మూడో సీజన్లో స్మృతి మంధాన కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్గా నిలిచింది.