సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్లో ఫార్ములా-ఈ జోష్ వచ్చేసింది. దేశంలో తొలిసారి ఫార్ములా-ఈ రేసుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో రేసింగ్కు ఏర్పాట్లు చేస్తున్నది. సీజన్-9లో భాగంగా ఫిబ్రవరి 11న జరుగనున్న రేసింగ్కు సంబంధించి బుధవారం హైటెక్స్లో కార్యక్రమాన్ని నిర్వహించారు.
మొత్తం 22,500 టిక్కెట్లను బుక్మైషో ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. గ్రాండ్స్టాండ్స్కు 1000, చార్జ్డ్ గ్రాండ్స్టాండ్స్కు 3,500, ప్రీమియమ్ గ్రాండ్స్టాండ్స్కు రూ.6000, ఏస్ గ్రాండ్స్టాండ్స్కు 10,000లుగా నిర్ణయించారు. పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ తొలి టిక్కెట్ కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏస్ నెక్స్ జెన్ సీఈవో దిల్బాగ్ గిల్, ఎఫ్ఎమ్ఎస్సీఐ అధ్యక్షుడు అక్బర్ ఇబ్ర కిరణ్రావు తదితరులు పాల్గొన్నారు.