హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత వాలీబాల్ జట్టు మాజీ ప్లేయర్ రియాజ్ అహ్మద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రియాజ్ బుధవారం తుదిశ్వాస విడిచారు. 1962 (జకార్తా), 1966 (బ్యాంకాక్)ఆసియా క్రీడల్లో భారత వాలీబాల్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ హైదరాబాదీ దిగ్గజం రజత పతకం గెలువడంలో కీలకంగా వ్యవహరించాడు.
తన అద్భుతమైన ఆటతీరుతో జట్టును ముందుండి నడిపించిన రియాజ్ ఎందరో యువ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచారు. 1986లో గోల్డ్కప్ గెలిచిన భారత జట్టుకు రియాజ్ కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాభిమానులు సంతాపం ప్రకటించారు.