ఆసియా కప్లో టీమిండియా శుభారంభం చేసింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అంటు బంతితో, ఇటు బ్యాటుతో రెచ్చిపోయి జట్టుకు విజయాన్నందించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్ వంటి జట్లకు గతంలో కోచ్గా వ్యవహరించిన మిక్కీ ఆర్థర్.. పాండ్యాను తెగ మెచ్చుకున్నాడు. అతన్ని చూస్తుంటే సఫారీ లెజెండ్ జాక్వెస్ కలిస్ గుర్తొస్తున్నాడని చెప్పాడు.
సౌతాఫ్రికాకు కలిస్ అద్భుతమైన సేవలు అందించాడు. తన కెరీర్లో ఎక్కువగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను.. బంతితో కూడా అద్భుతాలు చేశాడు. పాండ్యా కూడా కలిస్లాగే ఉన్నాడని, నాణ్యమైన పేసర్లా బౌలింగ్ చేస్తూ టాప్-5లో బ్యాటింగ్ చేయడం జట్టుకు బాగా కలిసొస్తుందని ఆర్థర్ అన్నాడు. దీనివల్ల భారత జట్టు 12 మందితో ఆడినట్లు అనిపిస్తుందని కొనియాడాడు.
పాండ్యా చాలా మెచ్యూర్గా ఎదుగుతున్నాడని, ఐపీఎల్లో కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తను ముందడుగు వేసి విజయాలు అందించాడని చెప్పాడు. అద్భుతమైన క్రికెటర్గా ఎదుగుతున్నాడంటూ పాండ్యాను ఆకాశానికెత్తేశాడు. నాలుగేళ్ల క్రితం గాయపడిన పాండ్యా.. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.
గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత చాలా కాలం విశ్రాంతి తీసుకొని, ఐపీఎల్లో మళ్లీ పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింటా రాణిస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.