Dattajirao Gaekwad: భారత క్రికెట్ జట్టుకు ఆరంభదశలో ప్రాతినిథ్యం వహించిన మాజీ సారథి దత్తాజీరావు గైక్వాడ్ (95) మంగళవారం ఉదయం కన్నుమూశారు. బరోడాకు చెందిన గైక్వాడ్.. తన సొంత ఇంటిలోనే తుదిశ్వాస విడిచారు. 1952 నుంచి 1961 దాకా భారత జట్టు తరఫున 11 టెస్టులు ఆడిన దత్తాజీరావు.. దేశానికి సారథ్యం వహించినవారిలో అత్యధిక కాలం జీవించిఉన్న సారథిగా ఘనత సొంతం చేసుకున్నారు. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు గైక్వాడ్.. అక్కడ టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. దత్తాజీరావు మరణం పట్ల బీసీసీఐతో పాటు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్ (ఎక్స్) ద్వారా సంతాపాన్ని ప్రకటించారు.
భారత జట్టు తరఫున 11 టెస్టులు ఆడిన గైక్వాడ్.. 350 పరుగులు చేశారు. ఇందులో ఒక అర్థ సెంచరీ కూడా ఉంది. జాతీయ జట్టులో తన ముద్ర వేయకపోయినా దేశవాళీలో మాత్రం గైక్వాడ్ పరుగుల వరద పారించారు. బరోడా తరఫున ఆడిన ఆయన.. 110 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 5,788 పరుగులు చేశారు. ఇందులో 17 శతకాలు, 23 అర్థ శతకాలున్నాయి. అత్యధిక స్కోరు 249గా ఉండటం గమనార్హం. అంతేగాక బౌలింగ్లోనూ 25 వికెట్లు పడగొట్టారు.
The BCCI expresses its profound grief at the passing away of Dattajirao Gaekwad, former India captain and India’s oldest Test cricketer. He played in 11 Tests and led the team during India’s Tour of England in 1959. Under his captaincy, Baroda also won the Ranji Trophy in the… pic.twitter.com/HSUArGrjDF
— BCCI (@BCCI) February 13, 2024
దత్తాజీరావు మరణంపై ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ… బరోడా క్రికెట్తో పాటు జాతీయ జట్టులో కొత్త టాలెంట్ను ప్రోత్సహించేందుకు ఆయన అవిరాళ కృషి చేశారని పేర్కొన్నాడు. ఆయన మృతి భారత క్రికెట్కు తీరని లోటు అని తెలిపాడు. దేశవాళీలో బరోడాకు ఆడిన దత్తాజీరావు.. 1957-58 సీజన్లో ఆయన సారథ్యంలోనే ఆ జట్టును రంజీ ట్రోఫీ విజేతగా నిలిచారు.
Under the shade of the banyan tree at the Motibag cricket ground, from his blue Maruti car, Indian captain D.K. Gaekwad sir tirelessly scouted young talent for Baroda cricket, shaping the future of our team. His absence will be deeply felt. A great loss for cricketing community.… pic.twitter.com/OYyE2ppk88
— Irfan Pathan (@IrfanPathan) February 13, 2024