MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) రాంచీ (Ranchi)లో ఓటు హక్కు వినియోగించుకున్నారు (cast his vote). పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ధోనీ అక్కడ తన అమూల్యమైన ఓటు వేశారు. బ్రౌన్ కలర్ ఫుల్ నెక్ టీషర్ట్తో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ధోనీని చూసిన స్థానికులు మిస్టర్ కూల్తో మాట్లాడేందుకు ఎగబడ్డారు. దీంతో పోలీసుల భద్రత మధ్య ధోనీ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
#WATCH | Jharkhand: Former Indian Captain MS Dhoni arrives at a polling station in Ranchi, to cast his vote for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/c1JolQ45nl
— ANI (@ANI) May 25, 2024
కాగా, మే 19న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో సీఎస్కే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మరోవైపు దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఈ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
#WATCH | Jharkhand: Former Indian Captain MS Dhoni arrives at a polling station in Ranchi, to cast his vote for the sixth phase of #LokSabhaElections2024 pic.twitter.com/W5QQsIu90C
— ANI (@ANI) May 25, 2024
Also Read..
Arvind Kejriwal | నియంతృత్వం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఓటేశా : అరవింద్ కేజ్రీవాల్
Kerala | కేరళలో భారీ వర్షాలు.. 11 మంది మృతి.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Jaishankar | కేంద్ర మంత్రి జైశంకర్కు అరుదైన అవకాశం.. ఎన్నికల సంఘం నుంచి సర్టిఫికెట్