న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ కరోనా వైరస్తో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. తన తండ్రి మృతిచెందిన విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. ‘నా తండ్రి శివప్రసాద్ సింగ్ కన్నుమూసిన విషయాన్ని తీవ్ర దు:ఖంతో తెలియజేస్తున్నాను. కొవిడ్తో బాధపడుతూనే మే 12న మమ్మల్ని వదిలివెళ్లిపోయారు. నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరేలా మీరంతా ఆ దేవుణ్ని ప్రార్థించాలని కోరుతున్నా. ఆర్ఐపీ పాపా’ అంటూ సింగ్ ట్వీట్ చేశాడు.
2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆర్పీ కూడా ఉన్నాడు. భారత్ తరఫున సింగ్
14 టెస్టు మ్యాచ్లు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్పీ 32 ఏండ్ల వయసులో 2018లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వీడ్కోలు అనంతరం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. భారత సీనియర్ లెగ్స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ (60) కూడా కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.