కోల్కతా: భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ సమర్ ‘బద్రు’బెనర్జీ (92) శనివారం మృతి చెందారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమర్ బెనర్జీ శనివారం తెల్లవారు జామున మరణించినట్టు మోహన్ బగన్ జట్టు మేనేజర్ దేబశిశ్ దత్తా వెల్లడించారు.
‘బద్రు దా’అని ప్రేమగా పిలుచుకునే సమర్ భారత ఫుట్బాల్ జట్టుకు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో నేతృత్వం వహించి జట్టును నాలుగో స్థానంలో నిలిపాడు