లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ప్రకంపనలు మొదలయ్యాయి. వన్డే ప్రపంచకప్లో ఆ జట్టు పేలవ ఆటతీరు కనబరుస్తుండగా.. పీసీబీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం జట్టుకు చీఫ్ సెలెక్టర్గా వ్యవహరిస్తున్న మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సోమవారం తన పదవికి రాజీనామా చేశాడు. ఆ లేఖను పీసీబీ చీఫ్ జకా అష్రఫ్కు పంపించాడు.
ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇంజమామ్ మాట్లాడుతూ.. ‘వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదు. ఈ అంశంపై పీసీబీ విచారణ చేపట్టాలి. నాకు ప్లేయర్ ఏజెంట్ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదు’ అని అన్నాడు.