Rishabh Pant | టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంత్కు ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో పంత్ త్వరగా కోలుకోవాలని టీం ఇండియా క్రికెటర్లు ప్రార్థించారు. న్యూజిలాండ్తో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా ప్రస్తుతం ఆటగాళ్లు మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తదితరులు సోమవారం ఉదయం ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ దక్కించుకుని సొంతగడ్డపై తమకు తిరుగులేదని చాటిచెప్పింది. శనివారం ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో టీంఇండియా 8 వికెట్ల తేడాతో(179 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సొంతగడ్డపై భారత్కు ఇది వరుసగా ఏడో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. ఇక నామమాత్రపు మూడో వన్డే మంగళవారం ఇండోర్లో జరగనుంది.
Madhya Pradesh | Indian cricketers Suryakumar Yadav, Kuldeep Yadav, and Washington Sundar visited Mahakaleshwar temple in Ujjain and performed Baba Mahakal's Bhasma Aarti. pic.twitter.com/nnyFRLMbfa
— ANI (@ANI) January 23, 2023