న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్(Ind Vs Pak) క్రికెట్ మ్యాచ్ అంటేనే హైవోల్టేజ్ గేమ్. ఇక ఆ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడుతుంటారు. నిజానికి ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్లు లేవు. కానీ అప్పుడప్పుడు ఈ రెండు జట్లూ..ఐసీసీ టోర్నీల్లో తలపడుతుంటారు. అయితే వచ్చే నెలలో అమెరికాలో జరగనున్న టీ 20 వరల్డ్కప్లో దాయది సమరం జరగనున్నది. జూన్ 9వ తేదీన జరగనున్న ఈ మ్యాచ్కు ఫుల్ క్రేజీ ఉంది. ఇక ఆ మ్యాచ్ టికెట్లను భారీ ధరకు అమ్మేస్తున్నారు. ఒక్కొక్క టికెట్ను 20 వేల డాలర్లు అంటే సుమారు 17 లక్షలకు ఒక టికెట్ను అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలకు టికెట్లను అమ్మడాన్ని ఖండిస్తూ ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు.
న్యూయార్క్లోని నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్కు భారీ ధరకు టికెట్లు అమ్ముతున్నారని, క్రికెట్ ఆటను ప్రోత్సహిస్తున్నారా లేక ఆ క్రీడను అడ్డుకుంటున్నారా అని లలిత్ మోదీ ప్రశ్నించారు. డైమండ్ క్లబ్కు చెందిన టికెట్లను 20 వేల డాలర్లకు అమ్మడం షాక్కు గురిచేస్తోందన్నారు. క్రికెట్ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అమెరికాలో వరల్డ్కప్ను నిర్వహిస్తున్నారని, కానీ లాభాలు ఆర్జించేందుకు కాదు అని లలిత్ మోదీ తెలిపారు. అనేక వెబ్సైట్లు క్రికెట్ మ్యాచ్లకు చెందిన టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఇప్పటి వరకు ఐసీసీ అధికారికంగా స్పందించలేదు.
Shocked to learn that @ICC is selling tickets for Diamond Club at $20000 per seat for the #indvspak WC game. The WC in the US is for game expansion & fan engagement, not a means to make profits on gate collections. $2750 for a ticket It’s just #notcricket #intlcouncilofcrooks pic.twitter.com/lSuDrxHGaO
— Lalit Kumar Modi (@LalitKModi) May 22, 2024