లండన్: ప్రతిష్ఠాత్మక మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్సీసీ)లో ఐదుగురు భారత క్రికెటర్లకు సభ్యత్వం లభించింది. తమ కెరీర్లో అనితర సాధ్యమైన విజయాలకు తోడు క్రికెట్ చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్సీసీ..భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సహా యువరాజ్సింగ్, సురేశ్రైనా, మిథాలీరాజ్, జులన్గోస్వామికి జీవితకాల సభ్యత్వం కల్పించింది. వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన 19 మంది క్రికెటర్లు ఎమ్సీసీలో చోటు దక్కించుకున్నట్లు సీఈవో, కార్యదర్శి గై లావెండర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.