శాంటియాగొ(చిలీ) : మహిళల జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత జూనియర్ జట్టు 12-0తో కెనడాను చిత్తుగా ఓడించింది.
ఆరంభంనుంచి దూకుడును ప్రదర్శించిన భారత్కు అన్ను (4,6,39ని.), దీపి మోనిక టొప్పొ (21ని.), ముంతాజ్ ఖాన్ (26,41,54, 60ని.), దీపిక సొరెంగ్ (34,50,54ని.), నీలమ్(45ని.) గోల్స్ సాధించారు. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్లో శుక్రవారం జర్మనీని ఢీకొంటుంది.