FIFA : అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(FIFA) ఫుట్బాల్ క్లబ్స్(Football Clubs)కు భారీ బొనాంజా ప్రకటించింది. 51 దేశాలకు చెందిన 440 క్లబ్స్కు 209 మిలియన్ డాలర్లు.. అంటే రూ.1000 కోట్లకు పైగా డబ్బులు ముట్టజెప్పనుంది. ఎందుకో తెలుసా..? 2022లో ఖతర్లో జరిగిన వరల్డ్ కప్లో 440 క్లబ్స్కు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఆ మెగా టోర్నమెంట్ నిర్వహణలో ఆయా క్లబ్స్ పాత్రకు గుర్తింపుగాగా 209 మిలియన్ డాలర్లను బహుమతిగా అందించనుంది. ఈ విషయాన్ని ఫిఫా ఈరోజు అధికారికంగా వెల్లడించింది.
వరల్డ్ కప్ జట్టు(World Cup Team)లో ఉన్న ప్రతి ఆటగాడికి ఒక్క రోజుకు రూ.8 లక్షలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. ఫిఫా నిర్ణయంతో 837 మంది ఆటగాళ్లు లబ్ది పొందనున్నారు. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ప్రతి ఫుట్బాలర్కు ఈసారి లక్ష రూపాయలు అదనంగా ముట్టనున్నాయి. 2018లో రష్యాలో వరల్డ్ కప్ ముగిశాక ఒక్కొక్క ఫుట్బాలర్కు రోజుకు రూ.7 లక్షల చొప్పున ఇచ్చారు.
ఫిఫా నిర్ణయం వల్ల ఇంగ్లీష్ ఫుట్బాల్ క్లబ్స్కు ఎక్కువ వాటా లభించనుంది. దాదాపు 46 క్లబ్స్కు రూ.300 కోట్లకు పైగా దక్కనున్నాయి. మాంచెస్టర్ యునైటెడ్(Manchester United) క్లబ్కు అత్యధికంగా రూ.37 కోట్లు అందుతాయి. ఆ తర్వాత బార్సిలోనా(Barcelona), బేయెర్న్ మ్యునిచ్ క్లబ్కు భారీ డబ్బు ముట్టనుంది. ఇంగ్లీష్ క్లబ్స్ తర్వాత స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ క్లబ్స్కు భారీ మొత్తంలో డబ్బులు చేతికందనున్నాయి.
మాంచెస్టర్ యునైటెడ్, బార్సిలోనా క్లబ్స్
మరో విషయం ఏంటంటే..? 2026, 2030 నుంచి క్లబ్స్కు ఇచ్చే మొత్తాన్ని ఫిఫా రెట్టింపు చేయనుంది. అవును.. 355 మిలియన్ డాలర్లు అంటే.. రూ. 200 కోట్లకు పైగానే క్లబ్స్కు అందనున్నాయి. దీనికి సంబంధించిన పత్రాలపై ఫిఫా అధికారులు, యూరోపియన్ క్లబ్ ఆసోసియేషన్(European Club Association) వాళ్లతో కలిసి ఒప్పంద పత్రాల మీద సంతకాలు కూడా చేసింది.
ఖతర్లో వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతున్న మెస్సీ
నిరుడు ఖతర్లో జరిగిన వరల్డ్ కప్లో లియోనల్ మెస్సీ(Lionel Messi) సారథ్యంలోని అర్జెంటీనా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఉత్కంఠ రేపిన ఫైనల్లో ఫ్యాన్స్ను మెస్సీ సేన చిత్తు చేసింది. షూటౌట్లో 4-2తో గెలిచి మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.