హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం సమీక్ష నిర్వహించారు. సాట్స్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, హైదరాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23న ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే రన్ను నిర్వహించనున్నారు. నగరంలోని 15 ప్రముఖ కూడళ్ల నుంచి ఎల్బీ స్టేడియం వరకు రన్ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్లేయర్లు ధరించే జెర్సీలను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.