న్యూఢిల్లీ: హైదరాబాద్ వేదికగా ఈ నెల 11న జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు ప్రారంభానికి ఎఫ్ఐఏ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ సులేయమ్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2021 డిసెంబర్లో ఎఫ్ఐఏ అధ్యక్ష పదవి చేపట్టిన సులేయమ్ భారత్లో తొలిసారి జరుగబోతున్న రేసును వీక్షించే చాన్స్ ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సులేయమ్కు ఆహ్వానం అందించామని, రేసుకు హాజరయ్యే సూచనలు ఉన్నాయని ఫార్ములా-ఈ వర్గాలు తెలిపాయి.