హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఐఎస్సీఈ తెలంగాణ, ఏపీ రీజినల్ బాస్కెట్బాల్ టోర్నీలో ఫీచర్కిడ్స్ స్కూల్ దుమ్మురేపింది. అండర్-14, 17, 19 విభాగాల్లో టైటిళ్లు కైవసం చేసుకుని తమకు తిరుగులేదని చాటిచెప్పింది.
శుక్రవారం జరిగిన అండర్-19 ఫైనల్లో ఫీచర్ కిడ్స్ టీమ్ 37-30 తేడాతో జాన్సన్గ్రామర్ స్కూల్పై గెలిచింది. అద్వైత్(14) టాప్స్కోరర్గా నిలిచాడు. అండర్-17 తుదిపోరులో ఫీచర్కిడ్స్ 54-33తో సెయింట్ జోసెఫ్పై, అండర్-14లో ఫీచర్కిడ్స్ 36 -34తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్పై గెలిచి టైటిళ్లు దక్కించుకుంది.