దుబాయ్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోనూ ఒక స్థానం దిగజారాడు. ఓపెనర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ(773 పాయింట్లు).. విరాట్(766)ను అధిగమించి నాలుగో ర్యాంక్కు చేరుకున్నాడు. బుధవారం తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్లో 916 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్లో 908 పాయింట్లతో ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ తొలి స్థానం నిలబెట్టుకోగా.. అశ్విన్ (839 పాయింట్లు) రెండో ర్యాంక్లో ఉన్నాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంక్ మెరుగుపర్చుకుని (10వ) టాప్-10లో చోటు సంపాదించాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా,అశ్విన్ వరుసగా మూడు, నాలుగు ర్యాంక్ల్లో కొనసాగుతున్నారు.