చండీగఢ్: కరోనా వైరస్ బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ దవాఖానలో కోలుకుంటున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని పీజీఐఎంఆర్ఈ ఆసుపత్రి వెల్లడించింది. ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాక మిల్కాను కుటుంబ సభ్యులు దవాఖానలో చేర్పించగా.. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం ఆయనను పర్యవేక్షిస్తున్నదని ప్రకటించింది. కాగా మిల్కాతో ప్రధాని మోదీ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే.
పుకార్లు వద్దు: రిజిజు
దిగ్గజం మిల్కా సింగ్ ఆరోగ్యం మెరుగుపడుతున్నదని, ఎలాంటి అసత్య ప్రచారం చేయవద్దని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. మిల్కా త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరారు. మిల్కా సింగ్ ఆరోగ్యం అత్యంత క్షీణించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. రిజిజు స్పందించారు.