IPL 2023: చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచికొట్టారు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్వెల్(77) అర్థ శతకంతో చెలరేగారు. దాంతో, ఆర్సీబీ9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్వెల్ వేగంగా ఆడారు. 11 ఓవర్లకు స్కోర్ వంద దాటించారు. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన వీళ్లిద్దరు వెంట వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత ఆర్సీబీ పరుగుల వేగం తగ్గింది. చివర్లో దినేశ్ కార్తిక్(16), మహిపాల్ లొమ్రోర్(8), వనిందు హసరంగ(6) ధాటిగా ఆడడంతో 180 ప్లస్ చేయగలిగింది.
Despite the early wickets, @RCBTweets with a successful powerplay!
FIFTY partnership up in no time between @faf1307 & @Gmaxi_32 🤝
Follow the match ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/Zz0O4UKy3n
— IndianPremierLeague (@IPL) April 23, 2023
సందీప్ శర్మ వేసిన 20వ ఓవర్లో దినేశ్ కార్తిక్(16) ఔటయ్యాడు. మొదటి బంతికి ఫోర్ కొట్టిన అతను రెండో బంతికి షాట్ ఆడాడు. బౌండరీ వద్ద బట్లర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే విజయ్ కుమార్ ఔటయ్యాడు. ఐదో బంతికి డేవిడ్ విల్లే రివర్స్ స్కూప్తో బౌండరీ కొట్టాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్, చాహల్కు ఒక్కో వికెట్ దక్కింది.