IPL: ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ దక్కించుకున్న స్పోర్ట్స్ లీగ్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రత్యేకతను చాటుతున్నది. ఆటకు ఆటతో పాటు ఆటగాళ్లకు సంపాదన, అభిమానులకు వినోదాన్ని అందిస్తున్న ఈ మెగాటోర్నీలో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు అమితాసక్తిని కనబరుస్తారు. ఒకటి, రెండు సీజన్లలో మెరుగైన ప్రదర్శనలు చేస్తే ఆ ఆటగాడికి కళ్లు చెదిరే డబ్బులు అందుతున్న ఈ లీగ్లో ఆడేందుకు పలువురు అంతర్జాతీయ స్థాయి స్టార్ ఆటగాళ్లు తమ జాతీయ జట్టు ఆడే మ్యాచ్లను వదిలేస్తున్నారంటే ఈ లీగ్ క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ఆదరణ కలిగిన లీగ్లో ఆడాలని తనకూ ఆశగా ఉందంటున్నాడు పాక్ క్రికెటర్ హసన్ అలీ. అవకాశమొస్తే ఐపీఎల్ ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
హసన్ మాట్లాడుతూ.. `ప్రపంచంలో ప్రతి క్రికెటర్ ఐపీఎల్లో భాగం కావాలని కోరుకుంటాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్. నాకూ ఐపీఎల్ ఆడాలని ఉంది. ఒకవేళ భవిష్యత్లో అవకాశమొస్తే ఐపీఎల్లో కచ్చితంగా ఆడతా..` అని చెప్పాడు.
Hasan Ali said “Every player wants to play IPL & it is my wish to play there. It is one of the biggest leagues in the world and I will definitely play there if there is an opportunity in the future”. [Samaa Lounge] pic.twitter.com/pKRjSDh9kh
— Johns. (@CricCrazyJohns) November 27, 2023
కాగా ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008)లో పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్లో భాగమయ్యారు. షోయభ్ మాలిక్, షోయభ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్, షాహిద్ అఫ్రిదిలు ప్రారంభ సీజన్లో ఆడారు. కానీ ఆ తర్వాత 2009లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశాక పాక్ క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం లేకుండా పోయింది. పాక్ ఆటగాళ్లమీద నిషేధం ఉన్నప్పటికీ ఆ దేశానికి చెందిన అజహర్ మహ్మద్ ఐపీఎల్లో ఆడాడు. అయితే అతడు ఆడింది మాత్రం బ్రిటీష్ పౌరుడిగా.. ఇటీవలే బ్రిటీష్ పౌరసత్వం పొందిన పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ కూడా రాబోయే సీజన్లలో ఐపీఎల్ ఆడే అవకాశాలున్నాయి.