సౌథాంప్టన్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ను వర్షం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తొలి రోజు పూర్తిగా రద్దవగా.. తర్వాతి రెండు రోజులు కూడా మొత్తం ఆట సాధ్యం కాలేదు. ఇప్పుడు నాలుగో రోజు కూడా మొత్తంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌథాంప్టన్లో సోమవారం రోజంతా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. ఇండియన్ టీమ్ ప్లేయర్ దినేష్ కార్తీక్ కూడా సౌథాంప్టన్లో వాతావరణం ఆటకు అనుకూలంగా లేదని సోమవారం ఉదయం ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమాయనికి 2 వికెట్లకు 101 పరుగులు చేసిన విషయం తెలిసిందే.