బార్బడోస్: చివరి క్షణం వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన టీ20 పోరులో ఇంగ్లండ్ ఓ పరుగు తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో విండీస్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా.. మూడు సిక్సర్లు, 2 ఫోర్లు బాదిన అకీల్ హుసేన్ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) 28 పరుగులు రాబట్టడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (45), మోయిన్ అలీ (31) రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, అలెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైన చోట షెఫర్డ్ (44 నాటౌట్; ఒక ఫోర్, 5 సిక్సర్లు), అకీల్ హుసేన్ చివర్లో రాణించినా ఫలితం లేకపోయింది.