Shoaib Bashir : భారత జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ కోసం సోమవారం బెన్ స్టోక్స్(Ben Stokes) నేతృత్వంలోని ఇంగ్లండ్ బృందం హైదరాబాద్ చేరుకుంది. అయితే.. యువ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్(Shoaib Bashir) మాత్రం ఇంకా జట్టుతో కలవలేదు. వీసా(Visa) జారీ ఆలస్యం కావడంతో అతడు అబూదాబాబీలోనే ఉండిపోయాడు. దాంతో, బషీర్కు తొందరగా వీసా ఇవ్వాలని బీసీసీఐ అక్కడి భారత దౌత్య కార్యాలయం అధికారులకు తెలిపింది.
వాళ్లు వీసా ఓకే చేశాక బషీర్ భారత విమానం ఎక్కనున్నాడు. కానీ, తొలి టెస్టుకు మరో మూడు రోజులే ఉంది. ఆలోపు బషీర్ జట్టుతో కలుస్తాడని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ నమ్మకంతో ఉంది. ఉప్పల్ స్టేడియంలో జనవరి 25న భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు షురూ కానుంది.
షోయబ్ బషీర్
పాకిస్థాన్లో పుట్టి పెరిగిన బషీర్ ఇంగండ్ తరఫున ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచులే ఆడాడు. ఆడింది తక్కువ మ్యాచులే అయినా 10 వికెట్లతో సత్తా చాటాడు. అంతేకాదు ఇంగ్లండ్ లయన్స్ తరఫున యూఏఈలో అద్భుతంగా రాణించాడు. దాంతో, సెలెక్టర్ల దృష్టిలో పడ్డ బషీర్ భారత పర్యటనకు ఎంపికయ్యాడు.
Hello, Hyderabad! 👋
The City of Pearls ⚪
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket pic.twitter.com/hJLQFWkIgp
— England Cricket (@englandcricket) January 21, 2024
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) 2023-25 సైకిల్లో భారత్, ఇంగ్లండ్లకు ఈ సిరీస్ చాలా కీలకం. ఫైనల్కు అర్హత సాధించాలంటే ప్రత్యర్థిని వైట్వాష్ చేయడం చాలా ముఖ్యం. అందుకని గతంలో భారత పిచ్లపై బొక్కబోర్లాపడిన ఇంగ్లండ్ ఈసారి పటిష్టమైన స్క్వాడ్తో వచ్చిది. 22 ఏండ్ల బషీర్తో పాటు మరో ఇద్దరు స్పిన్నర్లకు స్క్వాడ్లో చోటిచ్చింది. తద్వారా టీమిండియా బలమైన స్పిన్ అస్త్రంతోనే రోహిత్ శర్మ(Rohit Sharma) సేనను దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది.