బ్రిస్బేన్: టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ పాకిస్థాన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. 161 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 14.4 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 రన్స్ చేసింది. పాక్ జట్టులో ఓపెనర్ షాన్ మసూద్ అత్యధికంగా 39 రన్స్ చేశాడు. ఇఫ్తకర్ 22, వసీమ్ 26 రన్స్ చేశారు. చేజింగ్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ త్వరగా ఔటైనా.. స్టోక్స్, లివింగ్స్టోన్లు చెలరేగిపోయారు. బెన్ స్టోక్స్ 36, లివింగ్స్టోన్ 28 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత బ్యారీ బ్రూక్, సామ్ కర్రన్ భారీ షాట్లతో అలరించారు. బ్రూక్ 45, కర్రన్ 33 రన్స్ చేసి నాటౌట్గా నిలిచారు. బ్రూక్ ఇన్నింగ్స్లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ విజయాన్ని నమోదు చేసింది.