లీడ్స్: ఇంగ్లండ్ జట్టుతో లీడ్స్లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా చతికిల పడింది. ఇన్నింగ్స్, 76 పరుగుల ఘోర పరాజయాన్ని చవి చూసింది. టాప్ ఆర్డర్ రాణించినా మిడిల్ ఆర్డర్ చేతులు ఎత్తేయడంతో భారత్ ఓటమి ఖరారైంది. మొదటి ఇన్నింగ్స్లో 78 పరుగులకే చేతులెత్తేసింది టీం ఇండియా.
రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీం ఇండియా ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్లో టీం ఇండియా వెన్ను విరవడంలో ఇంగ్లండ్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, కాగ్ ఓవర్టన్, ఓలి రాబిన్సన్, శ్యామ్ కురాన్ కీలకంగా వ్యవహరించారు. ఓపెనర్ రోహిత్ శర్మ 19, అజింకా రహానే 18 మినహా మిగతా బ్యాట్స్మెన్లు ఇలా క్రీజ్లోకి వచ్చి అలా వెళ్లిపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ 432 పరుగులు చేసింది.
తొలి టెస్ట్ మ్యాచ్ వర్షార్పణం కాగా.. లార్డ్స్లో జరిగిన రెండో టెస్ట్లో టీం ఇండియా విజయం సాధించింది. ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ 1-1గా నిలిచింది. మరో రెండు టెస్ట్ మ్యాచ్లు జరుగాల్సి ఉంది.