England Womens Team : ఇంగ్లండ్ క్రికెట్(England Cricket)లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. మహిళా క్రికెటర్ల(Women Cricketers ) మ్యాచ్ ఫీజు(Match Fee) పెంచుతున్నట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు ఈరోజు ప్రకటించింది. దాంతో, ఇకనుంచి పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టుకు మ్యాచ్ ఫీజు చెల్లించనుంది. ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ మహిళా క్రికెట్కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈమధ్యే ముగిసిన మహిళల యాషెస్ సిరీస్(Ashes Series) మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా స్టేడియానికి వచ్చారు. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో మహిళా క్రికెటర్లు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు అందుకుంటున్న విషయం తెలిసిందే.
Men’s and Women’s cricketers gets same match fees:
•In Indian Cricket.
•In New Zealand Cricket.
•In South Africa Cricket.
•In England Cricket.This is fantastic to see cricket boards given same match fees to men’s and women’s teams & women’s cricket will get more exposure! pic.twitter.com/W8BXZXaoeV
— CricketMAN2 (@ImTanujSingh) August 30, 2023
‘మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజు పెంపు నిర్ణయం ఓ పెద్ద ముందడుగు. దీంతో, దేశంలోని అమ్మాయిలకు క్రికెట్ మరింత దగ్గర అవుతుందనే నమ్మకం నాకుంది’ అని ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్(Heather Knight) తెలిపింది. త్వరలో శ్రీలంక వన్డే సిరీస్తో పెరిగిన మ్యాచ్ ఫీజు వర్తించనున్నట్టు ఈసీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్
ఇంగ్లండ్ గడ్డపై ఈమధ్యే మహిళల యాషెస్ టెస్టు జరిగింది. ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. పురుషుల యాషెస్ను తలదన్నేలా స్టేడియం కిక్కిరిసి పోయింది. అయితే.. ఈ మ్యాచ్లో పర్యాటక ఆస్ట్రేలియా 89 పరుగులతో సంచలన విజయం సాధించింది. ఆల్రౌండర్ అష్ గార్డ్నర్ ఏకంగా 12 వికెట్లతో ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టింది. గార్డ్నర్ తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు ఓటమి పాలైంది.