బర్మింగ్హామ్: ఇంగ్లండ్ పర్యటనను పాకిస్థాన్ ఓటమితో ముగించింది. ఆతిథ్య జట్టుతో మూడు టెస్టుల సిరీస్లో 0-3తో వైట్వాష్ అయింది. శనివారం ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లిష్ టీమ్ 8 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసి సిరీస్ను స్వీప్ చేసింది. నాలుగో రోజు 130 పరుగుల స్వల్ప ఛేదనకు వచ్చిన ఆతిథ్య జట్టు 24.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. తొలి ఓవర్లోనే పాక్ పేసర్ అబ్బాస్.. ఓపెనర్ బెన్ డకెట్ (0), ఎమిలియో (0)ను డకౌట్ చేసి భయపెట్టినా.. కెప్టెన్ జో రూట్ (62 నాటౌట్), జోర్డాన్ కాక్స్ (59 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.