హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్.. విజయవాడ కనకదుర్గమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పర్యవేక్షణలో నవంబర్ 27 వరకు అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్న అండర్-19 ఇంగ్లండ్ క్రికెట్ బృందంలోని సభ్యులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇంగ్లండ్ క్రీడాకారులకు ఆలయ పాలక మండలి, ఆలయాధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరిని వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేశారు.