లండన్: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సోమవారం సమావేశమైన ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ సిరీస్పై కొంత స్పష్టత ఇచ్చింది. యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు ఇంగ్లండ్ సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఓ మెలిక పెట్టింది. తమ ప్రధాన ఆటగాళ్లు ఉంటేనే ఆడేందుకు సిద్ధమని ప్రకటించింది. జట్టు సభ్యులతో సంప్రదింపులు చేసి వారంలో వివరాలు వెల్లడిస్తామని ఈసీబీ ఆస్ట్రేలియాకు తెలిపింది. గతంలో మాదిరే సానుకూల వాతావరణంలో యాషెస్ సిరీస్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కఠిన నిబంధనల నేపథ్యంలో ఆసీస్లో పర్యటించేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు నిరాస్తకత ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ క్వారంటైన్ విషయంలో సడలింపు ఇస్తే ఐదు టెస్టుల సిరీస్ డిసెంబర్ 18న మొదలుకానుంది.