IND vs ENG | లండన్: ఈ నెలఖరులో భారత పర్యటనకు రానున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. తమ వెంట ప్రత్యేక వంటవాళ్లను తెచ్చుకోనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కావడంతో.. భారత్లో ఏడు వారాలకు పైగా ఉండాల్సి రావడంతో టీమ్తో పాటు చెఫ్ను కూడా తెచ్చుకుంటున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఈ నెల 25 నుంచి హైదరాబాద్లో జరగనున్న తొలి టెస్టుతో ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది.
2012 తర్వాత ఇంగ్లిష్ జట్టు భారత్లో టెస్టు సిరీస్ విజయం సాధించలేకపోయిన విషయం తెలిసిందే. గత పర్యటనలో తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లండ్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోయింది.
ఈ సారి అలాంటి తప్పిదాలు జరగకుండా సుదీర్ఘ పర్యటనలో ప్లేయర్లు అస్వస్థత, అనారోగ్యాలకు గురికాకుండా తమ వెంట ప్రత్యేక వంటగాడిని తెచ్చకుంటున్నట్లు సమాచారం. ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ చెఫ్ను భారత్కు తెస్తున్నట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. గతంలో పాకిస్థాన్ పర్యటన సందర్భంగానూ ఇంగ్లండ్ ఇలా ప్రత్యేక వంటవాళ్లను వెంట తీసుకెళ్లింది.