లండన్: ఇండియాతో జరగనున్న మూడో టెస్ట్కు ముందు ఇంగ్లండ్( India vs England )కు షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ టీమ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ హెడింగ్లీ టెస్ట్కు దూరమయ్యాడు. బుధవారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో వుడ్ గాయపడ్డాడు. అయితే మూడో టెస్ట్ వరకూ అతడు కోలుకుంటాడని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ భావించినా.. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయాడు. అయితే అతడు టీమ్తోనే ఉంటాడని, మెడికల్ టీమ్తో కలిసి కోలుకోవడంపై దృష్టిసారిస్తాడని ఈసీబీ తెలిపింది. మూడో టెస్ట్ తర్వాత అతని ఫిట్నెస్ను మరోసారి అంచనా వేయనున్నారు. ఇప్పటికే బ్రాడ్, ఆర్చర్, వోక్స్, బెన్ స్టోక్స్లాంటి వాళ్లను మిస్సయిన ఇంగ్లండ్కు.. ఇప్పుడు వుడ్ కూడా గాయపడటం మింగుడు పడటం లేదు.