England Vs Tema India |20 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 99 పరుగులు చేసింది. క్రీజ్లో లివింగ్ స్టోన్, బెన్ స్ట్రోక్ ఆడుతున్నారు. టీం ఇండియాతో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ గురువారం రెండో వన్డే ఆడుతున్నది. 21 ఓవర్లు పూర్తయ్యే సరికి 102 పరుగులు చేసింది. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్, చాహల్ రెండు వికెట్లు తీశారు. ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తున్న జోరూట్ (11) 18వ ఓవర్లో కీలక అవుటయ్యాడు.18 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. 18వ ఓవర్లో చాహల్ వేసిన నాలుగో బంతిని ఆడబోయిన జోరూట్ ఎల్బీ డబ్ల్యూ అయ్యాడు.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ స్థానం కల్పించారు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కోహ్లీ ఆడనున్నాడు. పిచ్లో తేమ ఉందని, అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇటీవల ఫామ్లోని కోహ్లీ తొలి వన్డేలో ఆడలేదు. ఇక విండీస్తో జరిగే టీ20 సిరీస్కు ప్రకటించిన జట్టులోనూ కోహ్లీకి స్థానం దక్కలేదు. అతనికి రెస్ట్ ఇచ్చారు. అయితే ఇంగ్లండ్తో జరిగే రెండో వన్డేకు మాత్రం కోహ్లీకి ఛాన్స్ ఇచ్చారు.