హెడింగ్లీ: ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్( Ind vs Eng )కు భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఉదయం సెషన్ ప్రారంభం కాగానే ఆ టీమ్ మిగతా రెండు వికెట్లు కోల్పోయి 432 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 354 పరుగుల ఆధిక్యం సంపాదించింది. టీమిండియా బౌలర్లలో షమి 4, బుమ్రా, జడేజా, సిరాజ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. కెప్టెన్ జో రూట్ 121 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఓపెనర్లు హాఫ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో కేవలం 78 పరుగులకే ఆలౌటైన టీమిండియా.. ఈ మ్యాచ్లో గట్టెక్కడం అంత సులువుగా కనిపించడం లేదు.