ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన కోహ్లీ.. ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. డేవిడ్ విల్లే వేసిన బంతిని కవర్స్ మీదుగా పంపేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. అయితే బంతి అతను అనుకున్నంత ఎత్తుగా వెళ్లలేదు.
దాంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జేసన్ రాయ్.. చురుకుగా కదిలి క్యాచ్ అందుకున్నాడు. దీంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది. భారత జట్టు 13/2 స్కోరుతో కష్టాల్లో పడింది.
Some grab that 😍#ENGvIND pic.twitter.com/IICFJDHyac
— England’s Barmy Army (@TheBarmyArmy) July 10, 2022