ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే ప్రమాదకరమైన బట్లర్ (18)ను ఆవేష్ ఖాన్ అవుట్ చేయగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన జేసన్ రాయ్ (27)ను జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేశాడు.
8వ ఓవర్లో బంతి అందుకున్న మాలిక్ తొలి బంతికే జేసన్ రాయ్ను పెవిలియన్ చేర్చాడు. ఆఫ్ స్టంప్ ఆవల వేసిన బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించిన రాయ్ విఫలమవడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వైపు వెళ్లింది. దాన్ని పంత్ సులభంగా అందుకోవడంతో జేసన్ రాయ్ ఇన్నింగ్స్ ముగిసింది.