ది ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టును భారత్ చిత్తు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని బుమ్రా, షమీ నిలబెట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఈ క్రమంలోనే బుమ్రా కేవలం 19 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ కేవలం 110 పరుగులకే చాపచుట్టేసింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో శిఖర్ ధావన్ (31 నాటౌట్), రోహిత్ శర్మ (76 నాటౌట్) ఇద్దరూ కూడా నిలకడగా ఆడారు. అనవసర షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడిన ఈ జోడీ.. అద్భుతంగా రాణించింది. ఈ క్రమంలోనే సిక్సర్తో రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత గేరు మార్చి అదే ఓవర్లో మరో సిక్స్, ఫోర్ బాదాడు.
కార్సే వేసిన 19వ ఓవర్లో కూడా రోహిత్ ఒక సిక్సర్ బాదగా.. శిఖర్ ధావన్ బౌండరీతో జట్టుకు విజయాన్నందించాడు. దీంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే భారత జట్టు 18.4 ఓవర్లలో 114 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించి, మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే లార్డ్స్ మైదానంలో గురువారం జరగనుంది.
History for India as they defeated England by 10 wickets in their home 👏#ENGvIND pic.twitter.com/xdeXBjgmhM
— CricTracker (@Cricketracker) July 12, 2022