ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (1) తాను ఎదుర్కొన్న మూడో బంతికే పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ అరంగేట్ర ఆటగాడు గ్లీసన్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికే కోహ్లీ అవుటయ్యాడు.
గ్లీసన్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన కోహ్లీ.. డీప్ మిడ్ వికెట్ మీదుగా బాదేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. దాన్ని డేవిడ్ మలన్ అందుకోవడంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆ వెంటనే రిషభ్ పంత్ (26) కూడా పెవిలియన్ చేరాడు. గ్లీసన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించిన పంత్ విఫలమయ్యాడు. దాంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ బట్లర్ క్యాచ్ పట్టేయడంతో భారత జట్టు 61/3 స్కోరుతో కష్టాల్లో పడింది.