ఇంగ్లండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు తడబడుతోంది. ముగ్గురు వెటరన్లు ధవన్ (1), రోహిత్ (17), కోహ్లీ (17) ముగ్గురూ అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ (16) కూడా పెవిలియన్ చేరాడు.
ఓవర్టాన్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన సూర్యకుమార్.. డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ బట్లర్ సులభంగా పట్టేశాడు. దాంతో సూర్యకుమార్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. భారత జట్టు 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.