ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు సారధి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. తమ జట్టులో కీలకమైన ఆటగాళ్లు రూట్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్ కూడా జట్టుతో చేరడంతో అంతకుముందు టీ20 సిరీస్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
అదే సమయంలో టీ20 సిరీస్ గెలిచిన ఊపులోనే వన్డేలను కూడా విజయంతో ప్రారంభించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ మొదట బౌలింగ్ చేస్తామని చెప్పాడు. కోహ్లీ ఈ మ్యాచ్ ఆడటం లేదని, అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని రోహిత్ వెల్లడించాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లండ్ జట్టు: జేసన్ రాయ్, జానీ బెయిర్స్టో, జో రూట్, బెన్స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, మొయీన్ అలీ, క్రెగ్ ఓవర్టాన్, డేవిడ్ విల్లే, బ్రైడన్ కార్స్, రీస్ టాప్లే
🚨 A look at #TeamIndia's Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/8E3nGmlNOh #ENGvIND pic.twitter.com/BgVnnffbT6
— BCCI (@BCCI) July 12, 2022