ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ తడబడింది. జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్ అందించిన రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలకెత్తుకున్న సూర్యకుమార్ యాదవ్ (15)ను జోర్డాన్ అవుట్ చేశాడు.
ఆ తర్వాతి బంతికే హార్దిక్ పాండ్యా (11) కూడా పెవిలియన్ చేరాడు. కుదురుకునేందుకు టైం తీసుకున్న దినేష్ కార్తీక్ (12) రనౌట్ అయ్యాడు. హర్షల్ పటేల్ (13), భువనేశ్వర్ (2) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. ఇలా ఒక వైపు వికెట్లు పడుతున్నా కూడా నిలకడగా ఆడిన జడేజా (46 నాటౌట్).. భారత జట్టుకు మంచి స్కోరు అందించాడు.
అతను ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అరంగేట్ర ఆటగాడు రిచర్డ్ గ్లీసన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
Early charge from Indian openers,
England bowlers pulling things back,
Ravindra Jadeja with a brilliant cameo.The first half had it all, who will come on top at the end?#ENGvIND #ENGvsIND #England #India #T20I #Cricket #CricketWinner pic.twitter.com/Gl7ewbfR9d
— Cricket Winner (@cricketwinner_) July 9, 2022