ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బెయిర్స్టో (106)ను అవుట్ చేసిన షమీ.. ఇండియాకు బ్రేక్ ఇస్తే ఆ తర్వాతి ఓవర్లోనే స్టువర్ట్ బ్రాడ్ (1)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే మంచి షాట్లు ఆడుతూ ఇంగ్లండ్ స్కోరును పెంచేందుకు ప్రయత్నిస్తున్న శామ్ బిల్లింగ్స్ (36)ను అవుట్ చేశాడు. సిరాజ్ వేసిన బంతిని ఆఫ్ సైడ్ ఆడేందుకు బిల్లింగ్స్ ప్రయత్నించాడు. కానీ ఇన్సౌడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. దీంతో ఇంగ్లండ్ 9 వికెట్లకు 267 పరుగులతో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో మాథ్యూ పాట్స్, జేమ్స్ ఆండర్సన్ ఉన్నారు. ఇంకా భారత్ కన్నా ఇంగ్లండ్ జట్టు 149 పరుగులు వెనకబడి ఉంది.