ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (23) అవుటయ్యాడు. లంచ్ తర్వాత కాసేపటికే షమీ (13) అవుటవడంతో జాగ్రత్తగా ఆడిన జడ్డూ.. భారీ షాట్లకు పోకుండా నిదానంగా ఆడాడు. ఓవర్లో సాధ్యమైనన్ని బంతులు తనే ఆడుతూ చివర్లో సింగిల్ తీసి బుమ్రాకు స్ట్రైకింగ్ ఇస్తూ వచ్చాడు.
అయితే స్టోక్స్ వేసిన 80వ ఓవర్ రెండో బంతికే అతను బౌల్డ్ అయ్యాడు. స్టోక్స్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన జడ్డూ.. దాన్ని అడ్డుకోలేకపోయాడు. దాంతో అది వికెట్లను కూల్చింది. జడ్డూ నిరాశగా మైదానం వీడాడు.